మల్కాజిగిరి, వెలుగు: మున్సిపల్ అధికారులు తనను ఖాతరు చేయడం లేదని ఓ కార్పొరేటర్ చెరువులో దూకబోయాడు. మల్కాజిగిరిలోని 140వ డివిజన్ కార్పోరేటర్ శ్రవణ్ కొన్ని రోజులుగా మునిసిపల్ అధికారుల తీరుపై అసంతృప్తితో ఉన్నాడు. వారి తీరును నిరసిస్తూ గురువారం సఫిల్ గూడ చెరువులో దూకబోయాడు. పక్కనే ఉన్న వాళ్లు ఆయనను రక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నిధులతో చెరువును శుభ్రంగా చేయాలని చెబుతుంటూ అధికారులు వినడం లేదన్నారు. అందుకే ఇలా నిరసన తెలిపినట్లు చెప్పాడు.
