మున్సిపల్​ మీటింగ్​కు కౌన్సిలర్ల డుమ్మా

మున్సిపల్​ మీటింగ్​కు కౌన్సిలర్ల డుమ్మా
  • చేర్యాలలో అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల సహాయ నిరాకరణ

చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపల్​కౌన్సిల్​జనరల్​బాడీ మీటింగ్​కు చైర్​పర్సన్​స్వరూపరాణి శ్రీధర్​రెడ్డి తప్ప 11 మంది కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. మంగళవారం మున్సిపల్​ఆఫీస్​లోని మీటింగ్​హాల్​లో జనరల్​ బాడీ మీటింగ్​ఏర్పాటు చేశారు. వైస్​ చైర్మన్​ నిమ్మ రాజీవ్​రెడ్డితో పాటు కౌన్సిలర్లు  ఎవరూ హాజరు కాలేదు. కౌన్సిలర్లు అందరూ  స్థానికంగా ఉన్నప్పటికీ ఒక్కరూ మీటింగ్​కు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన మీటింగ్​లో కేవలం చైర్​పర్సన్​స్వరూపరాణి, మున్సిపల్​ కమిషనర్​రాజేంద్రకుమార్​ అరగంటపాటు వేచి చూసి మీటింగ్​రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా మున్సిపల్​చైర్​పర్సన్​పై అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లలో ఆరుగురు మీటింగ్​కు గైర్హాజరయ్యారు. చైర్​పర్సన్​ను ఏకాకిని చేసేందుకు కాంగ్రెస్​కౌన్సిలర్లు ఐదుగురూ అటెండ్​కాలేదు. రెండున్నర సంవత్సరాల తర్వాత మీకే చైర్​పర్సన్​ సీటు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని 7వ వార్డు కౌన్సిలర్ ​జుబేదా ఎగ్బాల్​ ఎమ్మెల్యేతో అన్నట్లు సమాచారం.