మెదక్ (చేగుంట), వెలుగు: లాక్డౌన్ వల్ల పని పోయింది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఆ టైమ్లో కుటుంబ పోషణకు చేసిన అప్పులు పెరిగిపోయాయి. వీటన్నింటితో మనస్తాపం చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ల మృతితో ఇద్దరు కొడుకులు అనాథలయ్యారు. మెదక్ జిల్లా చేగుంట మండలం పోతాన్పల్లికి చెందిన మంగలి కిషోర్ (42), కవిత (38) దంపతులు బతుకుదెరువుకోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వెళ్లారు. అక్కడ చిలకలగూడలో నివాసమున్నారు. కిషోర్ ఓ షాప్ను కిరాయికి తీసుకుని బార్బర్ షాప్ నడిపించేవాడు. కరోనా లాక్డౌన్ వల్ల గతేడాది, ఈసారి చాలా రోజులు షాప్ బంద్ చేయాల్సి వచ్చింది. దీంతో ఇళ్లు గడవడం కష్టమైంది. ఉపాధి లేక కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కిషోర్ 4 రోజుల కిందట భార్యా పిల్లలతో సొంతూరు పోతాన్పల్లికి వచ్చాడు. బుధవారం మళ్లీ హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకుని కొడుకులిద్దరినీ తాత మల్లేశ్తో బస్లో పంపాడు. కిషోర్, కవిత బైక్పై బయలు దేరారు. దారిలో తూప్రాన్లో ఆగి ఫర్టిలైజర్ షాప్లో గడ్డి మందు కొనుక్కొని వెనక్కి వచ్చారు. మాసాయిపేట బంగారమ్మ గుడి దగ్గరకు చేరుకుని భార్యాభర్తలిద్దరూ గడ్డి మందు తాగారు. కడుపులో మండటంతో భరించలేక బైక్పై తూప్రాన్ గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన కుటుంబీకులు పరిస్థితి సీరియస్గా ఉండటంతో కవితను కొంపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిషోర్ గురువారం అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో కొడుకులు స్నేహిత్(14), ప్రణీత్(12) అనాథలయ్యారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మనస్తాపంతో కిషోర్, కవిత సూసైడ్ చేసుకున్నారని కుటుంబీకులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, పోతాన్పల్లి గ్రామస్తులు కోరుతున్నారు.
కరోనాతో ఉపాధి పోయి.. అప్పులు పెరిగి దంపతుల సూసైడ్
- తెలంగాణం
- August 4, 2021
లేటెస్ట్
- Guy Whittall: చిరుతపులి దాడి.. ప్రాణాలతో బయటపడిన జింబాబ్వే మాజీ క్రికెటర్
- V6 DIGITAL 25.04.2024 EVENING EDITION
- SRH vs RCB: ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు
- Vishal: నన్ను అణచివేయాలని చూస్తున్నారు.. హీరో విశాల్ సంచలన కామెంట్స్
- NEFT, RTGS అంటే ఏమిటి? ఈ లావాదేవీలకు చార్జీలు ఉంటాయా? పూర్తి వివరాలు ఇవే..
- దేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారు: సీతక్క
- మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఎన్నికల తర్వాత రీఛార్జ్ రేట్లు పెరుగనున్నాయా?
- Ravi teja, Anudeep: రవితేజ సినిమాకి మోహన్ బాబు టైటిల్.. ఈసారి మరింత క్రేజీగా వస్తున్న అనుదీప్
- వాషింగ్టన్ డీసీ చేస్తానని.. రాజధాని లేకుండా చేశావ్.. జగన్ పై షర్మిల ఫైర్..
- SRH vs RCB: హైదరాబాద్లో బెంగళూరు హవా: ఉప్పల్లో RCB చారిత్రాత్మక మ్యాచ్
Most Read News
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి