ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని.. ఇంటికొచ్చి చూస్తే..

ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని.. ఇంటికొచ్చి చూస్తే..
  • సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వందనపురి కాలనీకి చెందిన శ్రీకాంత్ గౌడ్, ఆయన భార్య అనామిక, కూతురు స్నిగ్ధ  తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.  శ్రీకాంత్ గౌడ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. అనామిక, స్నిగ్ధ పురుగుల మందు తాగి చనిపోయినట్టు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. అయితే.. వీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
మూడు రోజులుగా తమ కూతురు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అనామిక తల్లిదండ్రులు చెబుతున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో.. ఇవాళ వారి ఇంటికి వచ్చామన్నారు. తలుపులు కొట్టినా తీయలేదని.. తలుపులు తీసి లోపలికి వెళ్లే సరికి ముగ్గురు చనిపోయి ఉన్నారని చెప్పారు. శ్రీకాంత్ గౌడ్ కు ఆర్థిక ఇబ్బందులు గానీ, కుటుంబ సమస్యలు గానీ లేవంటున్నారు స్థానికులు. అందరితో కలిసి మెలిసి ఉండేవారని చెబుతున్నారు. సమస్యలేవీ లేవని.. అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరంగా ఉందన్నారు. వీరి ఆత్మహత్యకు కారణాలేమిటి.. దారి తీసిన పరిణామాలేమిటన్నది నిగ్గు తేల్చేందుకు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

 

 

ఇవి కూడా చదవండి


సమాజాన్ని ఎదిరించి.. ఫైన్ కట్టి కూతురిని చదివించింది

ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామస్థులు

డిటర్జెంట్ పేరుతో లక్షల్లో నగదు తరలింపు