గంటల వ్యవధిలోనే దంపతులు మృతి.. కరీంనగర్ జిల్లా కొరటపల్లిలో విషాదం

గంటల వ్యవధిలోనే దంపతులు మృతి.. కరీంనగర్ జిల్లా కొరటపల్లిలో విషాదం
  • గుండెపోటుతో భర్త.. అస్వస్థతకు గురై భార్య  

రామడుగు, వెలుగు : గంటల వ్యవధిలోనే వృద్ధ దంపతులు మృతిచెందారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి గ్రామానికి చెందిన మేకల సుందర్​రెడ్డి(85), అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు కరీంనగర్​లోని ఆస్పత్రిలో జాయిన్ చేశారు.  చికిత్సపొందు తూ బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయాడు. 

 సుందర్​రెడ్డి అంత్యక్రియలు మధ్యాహ్నం పూర్తి చేశారు. అదే రోజు సాయంత్రం అతని భార్య మణెమ్మ(78)  తీవ్ర అస్వస్థతకు గురవగా కరీంనగర్​కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఒకే రోజు దంపతుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.