- ఫేజ్3 ట్రయల్స్లో తేలినట్టు లాన్సెట్ వెల్లడి
న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్.. 77.8% బాగా పని చేస్తుందని లాన్సెట్స్టడీ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవంది. ఫేజ్3 ట్రయల్స్లో ఈ విషయం వెల్లడైనట్టు లాన్సెట్ జర్నల్లో రాశారు. టీకా వేసుకున్న వాళ్లలో కరోనాను కట్టడిచేసే యాంటీబాడీలు బాగా డెవలప్అయ్యాయని వివరించింది. కొంత మందిలో తలనొప్పి, జ్వరం, అలసట, ఇంజెక్షన్ వేసిన ప్రాంతంలో నొప్పి లాంటి సైడ్ఎఫెక్ట్స్ కనిపించాయంది. గతేడాది నవంబర్ 16 నుంచి ఈ ఏడాది మే 17 వరకు ట్రయల్స్ జరిగాయని.. 18 నుంచి ఆ పైబడిన వాళ్లు ట్రయల్స్లో పాల్గొన్నారని తెలిపింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని 25 హాస్పిటళ్లలో ట్రయల్స్ చేశామంది. ప్రస్తుత ఇన్ఫర్మేషన్ కేవలం ప్రిలిమినరీ స్టేజ్లోనిదేనని.. కరోనాతో హాస్పిటల్లో చేరిన, వైరస్తో తీవ్రంగా ఇబ్బంది పడిన వాళ్ల శాంపుల్ సైజ్కూడా చేరిస్తే ఎంత ఎఫక్టివ్గా పనిచేస్తోందనేది తెలుస్తుందని చెప్పింది. 18 ఏండ్లు పైబడిన వాళ్లు కొవాగ్జిన్ వేసుకొవచ్చని డబ్ల్యూహెచ్వో ఇటీవలే అనుమతిచ్చింది. కరోనా వైరస్ను ఇనాక్టివేట్చేసి ఈ టీకాను తయారు చేశారు. వ్యాక్సిన్ను రెండు డోసులుగా ఇస్తారు. 28 రోజుల తర్వాత రెండో డోసు వేస్తారు.