దేశంలో 12 వేలు దాటిన కేసులు

దేశంలో 12 వేలు దాటిన కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య బుధవారం నాటికి 12,320 కి చేరింది. ఇందులో ఇప్పటి వరకు 1,508 మంది కోలుకోగా.. ఈ మహమ్మారి కారణంగా 420 మంది చనిపోయారు. బుధవారం ఒక్కరో- జే 849 కేసులు నమోదు కాగా 143 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దేశం మొత్తమ్మీద ఒక్కరోజే 25 మంది చనిపోయారు. మహారాష్ట్ర లో కేసుల సంఖ్య, మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఒక్కరోజే 232 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 2,916 కు చేరింది. 187 మంది చనిపోయారు. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో 1,578 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లో బుధవారం ఒక్కరోజే 197 మంది కరోనాబారిన పడ్డారు.