51 శాతం దాటిన క‌రోనా రిక‌వ‌రీ రేటు

51 శాతం దాటిన క‌రోనా రిక‌వ‌రీ రేటు

క‌రోనా బారిన‌ప‌డిన పేషెంట్ల రిక‌వ‌రీ రేటు క్ర‌మంగా పెరుగుతోంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 7419 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,32,424 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారని తెలిపింది. అందులో 1,69,797 మంది పూర్తిగా కోలుకున్నార‌ని చెప్పింది. ప్ర‌స్తుతం 1,53,106 మంది వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని పేర్కొంది. దేశ వ్యాప్తంగా వైర‌స్ బారిన‌ప‌డిన వారిలో స‌గానికి పైగా పేషెంట్లు కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని, క‌రోనా రిక‌వ‌రీ రేటు 51.08 శాతానికి చేరింద‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా టెస్టింగ్ కెపాసిటీని భారీగా పెంచిన‌ట్లు తెలిపింది కేంద్ర ప్ర‌భుత్వం. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ ల్యాబ్స్ 653కు, ప్రైవేటు ల్యాబ్స్ 248కి పెంచిన‌ట్లు చెప్పింది ఆరోగ్య శాఖ‌. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 57,74,133 టెస్టులు చేసిన‌ట్లు తెలిపింది. ప్ర‌తి రోజూ ల‌క్ష‌కు పైగా క‌రోనా టెస్టులు చేస్తున్న‌ట్లు తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లోనే 1,15,519 శాంపిల్స్ ప‌రీక్షించిన‌ట్లు వెల్ల‌డించింది.