కరోనాపై మరోసారి రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్

కరోనాపై మరోసారి రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్

కరోనా విషయంలో మరోసారి రాష్ట్రాలను అలెర్ట్ చేస్తూ కేంద్ర వైద్యారోగ్యశాఖ లేఖలు రాసింది. కోవిడ్ ను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని సూచించింది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్ ప్రొటోకాల్ ను కచ్చితంగా పాటించాలని తెలిపింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టాలని, అర్హులైన ప్రతి ఏజ్ గ్రూప్ వారికీ అవగాహన కల్పిస్తూ కరోనా టీకా అందించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల  హెల్త్, చీఫ్ సెక్రటరీలకు లేఖలు పంపింది. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ఈ లేఖలు రాసింది. మాస్క్ ధరించడం, శానిటైజర్ వినయోగంలోనూ నిర్లక్ష్య ధోరణి రాకుండా చూడాలని చెప్పింది. అలాగే పక్కాగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని సూచించింది.

మరిన్ని వార్తల కోసం..

ఏటీఎం కార్డు పెడితే గోల్డ్ బయటికొస్తది!

రాధాకృష్ణుల ప్రేమ పండుగ.. హోలీ

రష్యా నుంచి అగ్గువకే ఆయిల్‌‌  కొంటున్నం