ఫోన్ చోరీకి గురైతే సీఈఐఆర్ లో నమోదు చేయాలి :  సీపీ అనురాధ

ఫోన్ చోరీకి గురైతే సీఈఐఆర్ లో నమోదు చేయాలి :  సీపీ అనురాధ
  •     పోగొట్టుకున్న 100 ఫోన్లను అందజేసిన సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: ఎవరైనా ఫోన్​పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ లో డాటా నమోదు చేయాలని, అప్పుడే ఫోన్ రికవరీ చేసే అవకాశం ఉంటుందని  సీపీ అనురాధ సూచించారు. శుక్రవారం ఆమె చోరీకి గురైన 100 ఫోన్లను రికవరీ చేసి సీపీ ఆఫీస్ లో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫోన్ పోయిన వెంటనే బాధితులు దగ్గరలోని పీఎస్​లో సంప్రదించాలని కోరారు.

అనంతరం సీఈఐఆర్ వర్టికల్ సిబ్బందిని అభినందించి అప్రిసియేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సీఐలు  శ్రీధర్, మల్లేశం,  కానిస్టేబుల్ స్వప్న, ఐటీ సెల్ సిబ్బంది స్వామి, రాజిరెడ్డి, హరీశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.