
- పోగొట్టుకున్న 100 ఫోన్లను అందజేసిన సీపీ అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: ఎవరైనా ఫోన్పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ లో డాటా నమోదు చేయాలని, అప్పుడే ఫోన్ రికవరీ చేసే అవకాశం ఉంటుందని సీపీ అనురాధ సూచించారు. శుక్రవారం ఆమె చోరీకి గురైన 100 ఫోన్లను రికవరీ చేసి సీపీ ఆఫీస్ లో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫోన్ పోయిన వెంటనే బాధితులు దగ్గరలోని పీఎస్లో సంప్రదించాలని కోరారు.
అనంతరం సీఈఐఆర్ వర్టికల్ సిబ్బందిని అభినందించి అప్రిసియేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సీఐలు శ్రీధర్, మల్లేశం, కానిస్టేబుల్ స్వప్న, ఐటీ సెల్ సిబ్బంది స్వామి, రాజిరెడ్డి, హరీశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.