రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగొద్దు : సీపీ సాయిచైతన్య

రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగొద్దు : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్, వెలుగు: మున్సిపల్​ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోలీసులు నిష్పక్షపాతంగా డ్యూటీలు నిర్వహించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. రాజకీయ నాయకుల  ప్రలోభాలకు లొంగొద్దన్నారు. మంగళవారం ఆయన జిల్లాలోని పోలీస్​ ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. సామాన్య ప్రజలకు నమ్మకం, భద్రత కలిగించేలా విధులు నిర్వహించాలని, పోలీస్​ శాఖ ప్రతిష్టను మరింత పెంచాలన్నారు. 

ఫిర్యాదులు రాగానే స్పందించాలని, సోషల్​ మీడియా వ్యాప్తిచెందే అబద్ధాలను నియంత్రించాలన్నారు. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీలు శ్రీనివాస్, రాజా వెంకట్​ రెడ్డి, వెంకటేశ్వర్​ రెడ్డి, మస్తాన్​అలీ, ఎస్బీ సీఐ శ్రీశైలం, ఇన్ స్పెక్టర్ అంజయ్య, ఎలక్షన్​ సెల్ ​ఇన్​స్పెక్టర్​ వీరయ్య ఉన్నారు.

కొవిడ్​ మరణాల కంటే ఎక్కువ మంది మృతి

కరోనా ​టైంలో మృతి చెందినవారికంటే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని సీపీ సాయిచైతన్య అన్నారు. కొవిడ్​ మహమ్మారి నుంచి రక్షణ కోసం మాస్క్​ ధరించిన వ్యక్తులు బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్లు ధరించడానికి వెనకాడుతున్నారని అన్నారు. 

రోడ్డు​ భద్రతా వారోత్సవాల సందర్భంగా అరైవ్​, అలైవ్​ పేరుతో రాజీవ్​ గాంధీ స్టేడియంలో నిర్వహించిన ప్రొగ్రామ్​లో ఆయన మాట్లాడారు. ఫోన్​ మాట్లాడుతూ వాహనాలు నడుపొద్దని, హెల్మెట్, సీట్​ బెల్ట్​ తప్పక వేసుకోవాలన్నారు. అంతర్జాతీయ బాక్సింగ్​ క్రీడాకారుడు హుసామొద్దీన్​, ట్రాన్స్​పోర్ట్​ ఆఫీసర్​ ఉమామహేశ్వర్​రావు, ఆర్టీసీ డిపో మేనేజర్​ ఆనంద్​, ఐఎంఏ ప్రెసిడెంట్​ డాక్టర్​ విశాల్​ ఉన్నారు.