చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే : సీపీ సాయిచైతన్య

చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే : సీపీ సాయిచైతన్య
  • ఒలంపిక్ రన్​లో సీపీ సాయిచైతన్య 

నిజామాబాద్, వెలుగు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే రాష్ట్ర​, జాతీయ​, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని సీపీ సాయిచైతన్య సూచించారు. శుక్రవారం నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో ఒలంపిక్ డే రన్​ను సీపీ ప్రారంభించి మాట్లాడారు. ఒలంపిక్​ పోటీలో పాల్గొనడం ప్రపంచంలోని ప్రతి క్రీడాకారుడి జీవిత లక్ష్యమన్నారు. యువతలో స్ఫూర్తి నింపే కార్యక్రమాలకు సహకరిస్తాననన్నారు. ఏసీపీ రాజా వెంకట్​రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్​అలీ, సీఐ ప్రసాద్, జిల్లా ఒలంపిక్ సంఘం సభ్యులు ఉన్నారు.

పోలీస్ డ్యూటీ మీట్ చాలా కీలకం

ఆఫీసర్లలో ఇన్వెస్టిగేషన్​ నైపుణ్యాలు పెంచే పోలీస్ డ్యూటీ మీట్​ను శుక్రవారం సీపీ సాయిచైతన్య తన ఆఫీస్​లో ప్రారంభించారు.  తమకు అన్ని తెలుసనే భావన ఏస్థాయిలో కూడా వద్దని, వృత్తిలో అప్​డేట్ కావాలన్నారు. సైంటిపిక్​ ఇన్వెస్టిగేషన్​, ఫింగర్ ప్రింట్​ ఇన్వెస్టిగేషన్​, క్లూస్ సేకరణ, నేర స్థలంలో సేకరించాల్సిన సమాచారంపై ఆఫీసర్లకు పరీక్ష నిర్వహించారు. ఫొరెన్సిక్​ సైన్స్​ ఫింగర్​ ప్రింట్​,  లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, ఐవో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంశాలపై  ఎంపిక చేసిన వారిని స్టేట్​ పోలీస్​ మీట్​కు పంపుతామని సీపీ తెలిపారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, సీసీఎస్​ ఏసీపీ నాగవేంద్రాచారి, సీసీఆర్​బీ ఏసీపీ రవీందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.