
- ఒలంపిక్ రన్లో సీపీ సాయిచైతన్య
నిజామాబాద్, వెలుగు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని సీపీ సాయిచైతన్య సూచించారు. శుక్రవారం నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో ఒలంపిక్ డే రన్ను సీపీ ప్రారంభించి మాట్లాడారు. ఒలంపిక్ పోటీలో పాల్గొనడం ప్రపంచంలోని ప్రతి క్రీడాకారుడి జీవిత లక్ష్యమన్నారు. యువతలో స్ఫూర్తి నింపే కార్యక్రమాలకు సహకరిస్తాననన్నారు. ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ, సీఐ ప్రసాద్, జిల్లా ఒలంపిక్ సంఘం సభ్యులు ఉన్నారు.
పోలీస్ డ్యూటీ మీట్ చాలా కీలకం
ఆఫీసర్లలో ఇన్వెస్టిగేషన్ నైపుణ్యాలు పెంచే పోలీస్ డ్యూటీ మీట్ను శుక్రవారం సీపీ సాయిచైతన్య తన ఆఫీస్లో ప్రారంభించారు. తమకు అన్ని తెలుసనే భావన ఏస్థాయిలో కూడా వద్దని, వృత్తిలో అప్డేట్ కావాలన్నారు. సైంటిపిక్ ఇన్వెస్టిగేషన్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్, క్లూస్ సేకరణ, నేర స్థలంలో సేకరించాల్సిన సమాచారంపై ఆఫీసర్లకు పరీక్ష నిర్వహించారు. ఫొరెన్సిక్ సైన్స్ ఫింగర్ ప్రింట్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, ఐవో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంశాలపై ఎంపిక చేసిన వారిని స్టేట్ పోలీస్ మీట్కు పంపుతామని సీపీ తెలిపారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, సీసీఎస్ ఏసీపీ నాగవేంద్రాచారి, సీసీఆర్బీ ఏసీపీ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.