నాగోల్​లో కొత్త ఠాణా

నాగోల్​లో కొత్త ఠాణా
  • ప్రారంభించిన రాచకొండ  సీపీ డీఎస్ చౌహాన్

ఎల్​బీనగర్, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధి నాగోల్​లో కొత్తగా ఏర్పాటైన పోలీస్ స్టేషన్​ను మంగళవారం సీపీ డీఎస్ చౌహాన్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నాగోల్ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని.. ఈ ఏరియాలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం భవనాన్ని ఇచ్చిన నాగోల్ నవచైతన్య యువజన సంఘం సభ్యులను సీపీ అభినందించారు. 

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తొందరలోనే నాగోల్ పోలీస్ స్టేషన్​కు మరో చోట కొత్త బిల్డింగ్​ను నిర్మించి ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ శ్రీధర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.