ఐసోలేషన్ సెంటర్లుగా సీపీఎం ఆఫీసులు

ఐసోలేషన్ సెంటర్లుగా సీపీఎం ఆఫీసులు
  •    తొందరలోనే హెల్ప్​ లైన్ ​సెంటర్లు 
  •     సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం 


పేదలు, ఒకే గదిలో ఉండే వారి కోసం సీపీఎం ఆఫీసుల్లో కరోనా ఐసోలేషన్​ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర సెక్రటరీ తమ్మినేని వీరభద్రం తెలిపారు. కరోనా బాధితులకు అండగా నిలవాలనీ, సహాయ కార్యక్రమాలు చేయాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం నిర్వహించారు.   రాఘవులు, తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... కరోనా బాధితులకు వైద్యం,  సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.  సర్కారు హాస్పిటల్స్​లో సరైన ట్రీట్ మెంట్  అందడం లేదని, దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు హాస్పిటల్స్​ పేషెంట్లను దోచుకుంటున్నాయన్నారు.   హైదరాబాద్​ను రాష్ట్ర కేంద్రంగా ఉంచి జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో కరోనా హెల్ప్​ లైన్​ సెంటర్లు ప్రారంభించనున్నట్టు తెలిపారు.  కరోనా  దృష్ట్యా  మే డే ప్రోగ్రామ్​ల్లో  తక్కువ మంది  ఉండేలా చూసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.