
పద్మారావునగర్, వెలుగు : అకస్మాత్తుగా గుండెపోటు (కార్డియక్ అరెస్ట్)కు గురైన వ్యక్తి ప్రాణాలను కాపాడే కార్డియో పల్మనరి రెస్క్యూటేషన్ (సీపీఆర్)పై గాంధీలో ఇయ్యాల, రేపు అవగాహన కల్పించనున్నారు. గాంధీ అలుమ్ని ఎడ్యుకేషన్ సెంటర్లో మెడికల్కాలేజీ అలూమ్ని అసోసియేషన్, గాంధీ గ్లోబల్ అలయెన్స్ ఆధ్వర్యంలో ఉచిత సీపీఆర్ ట్రైనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు.
కార్డియాక్అరెస్ట్ అయిన వెంటనే చేతుల ద్వారా బాధితుడి గుండెపై నొక్కినట్లయితే ప్రాణాలను కాపాడవచ్చని గాంధీ అలుమ్ని ప్రెసిడెంట్ డా.జి.ఆర్. లింగమూర్తి, సెక్రటరీ డా. ఏవీ.రత్నం తెలిపారు. శుక్ర, శనివారాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించే సీపీఆర్ ట్రైనింగ్ క్యాంపునకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క సిటిజన్ హాజరు కావాలని కోరారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఓ డాక్టర్గా ఎదుటి వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు.