
బెనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్యూ)కి చెందిన రీసెర్చర్లు 4 వేల ఏళ్లనాటి క్రాఫ్ట్ విలేజ్ను గుర్తించారు. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాభానియావ్ గ్రామంలో దాన్ని గుర్తించినట్లు బీహెచ్యూకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ ప్రొఫెసర్ ఏ.కే దుబే చెప్పారు. పురాతన గ్రంథాల్లో చెప్పిన క్రాఫ్ట్ గ్రామాల్లో ఇదీ ఒకటని, దాని ఆధారంగా పరిశోధనలు చేశామని దుబే అన్నారు. 5వ దశాబ్దానికి చెందిన గుడిని గుర్తించామని, దాంట్లో 4వేల ఏళ్ల నాటి కుండలు, 2 వేల ఏళ్ల క్రితం కట్టిన గోడలను కనుగొన్నామన్నారు. అక్కడి వస్తువులు, నిర్మాణాలను బట్టి 3,500 నుంచి 4 వేల ఏళ్ల క్రితంవి అని గుర్తించామని దుబే చెప్పారు. వారణాసికి దగ్గర్లో ఉండటంతో ఇది చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుందని పరిశోధకులు చెప్తున్నారు. సార్నాథ్, తిల్పాపూర్, రామ్నగర్లలో గతంలో ఇలాంటి క్రాఫ్ట్ గ్రామాలను గుర్తించారు.