న్యూఢిల్లీ: ప్రముఖ సినీనటి రష్మిక డీప్ఫేక్ వీడియో కేసులో ఏపీలోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్(24)ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. సోషల్ మీడియా తార జారా పటేల్ వీడియోను రష్మిక ఫేస్తో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడని చెప్పారు. నిందితుడి నుంచి ల్యాప్ టాప్, ఫోన్ స్వాధీనం చేసుకొని.. అందులో డేటా రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్స్ పేజీని నడిపిన నిందితుడు.. ఫాలోవర్ల సంఖ్య పెంచుకునేందుకు ఈ పని చేసినట్లు డీసీపీ వివరించారు. కాగా..తన డీప్ఫేక్ వీడియోను రూపొందించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులకు రష్మిక మందన్న కృతజ్ఞతలు తెలిపారు.