
హైదరాబాద్, వెలుగు: 2023–2025 కాలానికి గాను కొత్త మేనేజింగ్ కమిటీని క్రెడాయ్ హైదరాబాద్ నియమించింది. క్రెడాయ్ తీసుకునే నిర్ణయాలను సిటీలో ఈ కమిటీ అమలు చేస్తుంది. కొత్త మేనేజింగ్ కమిటీకి ప్రెసిడెంట్గా వీ రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీగా బీ జగన్నాథ్ రావు, ప్రెసిడెంట్ – ఎలక్ట్గా ఎన్ జైదీప్ రెడ్డి నియమితులయ్యారు. బిల్డింగ్ల నిర్మాణంలో లేబరర్లకు స్కిల్స్ నేర్పిస్తామని క్రెడాయ్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఎత్తైన బిల్డింగ్ల నిర్మాణంలో టెక్నికల్ స్కిల్స్ ఉన్న లేబర్ల అవసరం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సెక్టార్ బలంగా ఉందని, ఇదే ట్రెండ్ కొనసాగుతుందని వీ రాజశేఖర్ రెడ్డి అన్నారు.