డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ మత్తులో మొసళ్లు!!

డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ మత్తులో మొసళ్లు!!

డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ మత్తులో మొసళ్లు తూగుతున్నాయి. నీటి మడుగుల్లోంచి జనావాసాల్లోకి దూసుకొస్తున్నాయి. అంతటితో ఆగకుండా అగ్రెసివ్‌‌‌‌‌‌‌‌గా ప్రవర్తిస్తున్నాయి. కనిపించిన జంతువుల పైనా, మనుషులపైనా దాడులు చేస్తున్నాయి. యునైటెడ్‌‌‌‌‌‌‌‌ స్టేట్స్‌‌‌‌‌‌‌‌లోని టెనెస్సీలో మొసళ్ల మత్తు దెబ్బకి జనాలు వణికిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని జనాలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదే టైంలో డ్రగ్‌‌‌‌‌‌‌‌ డీలర్లకు రిక్వెస్టులు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పోలీసులు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. టెనెస్సీలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ దందా ఎక్కువగా సాగుతుంది. పోలీస్‌‌‌‌‌‌‌‌ రైడ్లకు భయపడి డీలర్లు ఆ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ టాయిలెట్‌‌‌‌‌‌‌‌లో పడేసి ఫ్లష్ చేస్తున్నారు. ఆ డ్రైనేజీ నీరు ఊళ్ల శివారుల్లో ఉండే నదుల్లోకి, సరస్సులోకి చేరుతుంది. ఫ్యూరిఫైయర్ల ద్వారా ఆ నీళ్లు మధ్యలోనే శుభ్రమవుతున్నప్పటికీ.. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌లో ఉండే కెమికల్స్‌‌‌‌‌‌‌‌ మాత్రం నాశనం కావట్లేదు. ఆ నీటి ప్రభావంతో బాతులు, రకరకాల చేపలు, మొసళ్లు మత్తు బారిన పడుతున్నాయి. పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నాయి. నార్త్‌‌‌‌‌‌‌‌ అలబామాలో గత వారంగా పదిహేను మొసళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకుని, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒకవేళ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ నాశనం చేయాలనుకుంటే తమకు సమాచారం అందించాలని డ్రగ్‌‌‌‌‌‌‌‌ డీలర్లను కోరుతున్నారు పోలీసులు. వాటిని తాము సరైన పద్ధతిలో నాశనం చేస్తామని, అరెస్టులు చేయబోమని అధికారులు, డ్రగ్‌‌‌‌‌‌‌‌ డీలర్లకు భరోసా ఇస్తున్నారు.