ఎలక్షన్ డ్యూటీకి వెళ్లనివ్వడం లేదని భార్యను చంపేశాడు ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్. ఈ ఘటన ఈ నెల 16 న జరుగగా విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. సీఆర్పీఎఫ్ 201 కోబ్రా దళానికి చెందిన గురువీర్ సింగ్.. తన భార్య గౌతమ్ తో కలిసి ఛత్తీస్ ఘడ్ జగదల్ పూర్ పోలీస్ హెడ్ క్వాటర్స్ లో నివసిస్తున్నాడు. అయితే ఈ నెల 17న గురువీర్ సింగ్ ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉండగా.. 16వ తేదీ రాత్రి.. భార్యా భర్తలకు గొడవైంది. 17న విధులకు వెళ్లొద్దని గౌతమ్ తన భర్త గురువీర్ సింగ్ తో వారించింది. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరుగగా… ఆమె గొంతు నులిమి చంపేశాడు గురువీర్. ఆతరువాత తన భార్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు సమాచారం ఇచ్చాడు గురువీర్ సింగ్. దీంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు తరలించగా.. హత్య చేసినట్టు రిపోర్ట్ వచ్చింది. గురువీర్ సింగ్ ను పోలీసులు విచారించగా తానే గౌతమ్ ను చంపినట్టు ఒప్పుకున్నాడు గురువీర్. పోలీసులు కేసు నమోదు చేశారు.
Chhattisgarh: A CoBRA personnel murdered his wife at their residence in Jagdalpur after they got into a quarrel when she allegedly asked him not to go for election duty. He has been arrested. (19.03.2019) pic.twitter.com/a6jzgFwmDM
— ANI (@ANI) March 20, 2019