అసలే వానాకాలం.. ఆపై తుప్పు పట్టిన ఇనుప కరెంట్ స్తంభం ప్రమాదకరంగా మారింది. బౌద్ధనగర్ డివిజన్ పార్సీగుట్ట అశోక్ సేవా సంఘ సమీపంలో కరెంట్ స్తంభం అగుడున తుప్పు పట్టి ఉంది. ఏ సమయంలోనైనా కూలిపోయేలా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వానలు కురుస్తున్న క్రమంలో ప్రమాదం పొంచి ఉందంటున్నారు. గతంలో పలువురికి కరెంట్ పోల్షాక్ కొట్టిందని పేర్కొంటున్నారు.
దీనిపై ఇప్పటికే పలుమార్లు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తుప్పుపట్టిన కరెంట్ పోల్ ను తొలగించి కొత్తది ఏర్పాటు చేసి, వేలాడే కరెంట్ తీగలను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. – పద్మారావునగర్, వెలుగు
