
వెనిస్లోని సాన్ బాసిలియో జట్టెరె నగరం. ఆదివారం. ఓపెద్ద క్రూయిజ్ షిప్ ఆగేందుకు మెల్లగా పోర్టు వైపు వస్తోంది. ముందో టూరిస్టు బోటుంది. అందులోని వాళ్లు షిప్పుకేసి చూస్తున్నారు. ఆగుతుంది కదా అని రోడ్డుపైనున్న జనం మెల్లగా నడుస్తున్నారు. కానీ ఇంజిన్ ఫెయిలై అది కంట్రోల్ తప్పింది. వస్తూ వస్తూ దాని ముందున్న టూరిస్టు బోటును, రోడ్డును బలంగా ఢీకొంది. దీంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.