ఏప్రిల్ 21న బల్దియా సీఎస్​సీలు ఓపెన్

ఏప్రిల్ 21న బల్దియా సీఎస్​సీలు ఓపెన్

హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీ హెడ్డాఫీసుతోపాటు సర్కిల్ ఆఫీసుల్లోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్ సీ) ఆదివారం ఓపెన్ చేసి ఉంటాయని కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ప్రాపర్టీదారులు ఎర్లీ బర్డ్​స్కీం కింద 5 శాతం రిబిట్​పొందొచ్చని చెప్పారు.

స్కీం ముగిసేందుకు మరో 10 రోజులే ఉండడంతో సిటిజన్​సర్వీస్​సెంటర్లను సెలవురోజు కూడా ఓపెన్​చేస్తున్నామని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు అధికారులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.