కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో కిడ్స్ విత్ ఖాకీ ప్రోగ్రాం నిర్వహించారు. నిజాంసాగర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వెహికల్ నడిపితే కుటుంబం ఏ విధంగా నష్టపోతుందో వివరించారు. సేఫ్ కామారెడ్డి పోస్టర్ను అవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలు ఉండవన్నారు. ఎస్పీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా వారి జీవితంలో గుర్తుండేలా ఒక మంచి బహుమతి ఇవ్వాలనే అలోచనతో కిడ్స్ విత్ ఖాకీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఏఎస్సీ చైతన్యారెడ్డి, అడిషనల్ ఎస్పీ నర్సింహరెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
తాడ్వాయిలో..
తాడ్వాయి : ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో చిల్డ్రన్స్ విత్ ఖాకీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 11 మంది కామారెడ్డి ఎస్పీఆర్ స్కూల్ విద్యార్థులు పోలీస్ స్టేషన్ను సందర్శించగా ఎస్సై నరేశ్ కేసుల దర్యాప్తు, లాండ్ ఆర్డర్, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్సై కొండల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
