ఐపీఎల్ పద్నాలుగో సీజన్ ప్రారంభానికి ముందే ఫేవరెట్స్ చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జోష్ హాజల్వుడ్ టోర్నీకి దూరం కానున్నాడు. కుటుంబంతో మరింత సమయం గడిపేందుకు గానూ టోర్నీకి దూరంగా ఉండాలని హాజల్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయం గురించి అతడు క్లారిటీ ఇచ్చాడు.
'గత 10 నెలలుగా బయో బబుల్, క్వారంటైన్లో ఉంటున్నా. అందుకే క్రికెట్ నుంచి కాస్త విరామం తీసుకుందామని అనుకుంటున్నా. వచ్చే వింటర్లో భారీ క్రికెట్ ఆడాల్సి ఉంది. షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. కాబట్టి రెస్ట్ తీసుకొని నన్ను నేను మానసికంగా, శారీరకంగా దృఢంగా మలచుకోవాలని నిర్ణయించా' అని హాజల్ వుడ్ చెప్పాడు.