కరెంట్ స్తంభాలను తీసుకెళుతున్న ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

కరెంట్ స్తంభాలను తీసుకెళుతున్న ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర పీఎస్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్‌ స్తంభాలను తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి నాగారం స్టేజీ దగ్గర బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కరెంట్ స్తంభాలను తరలిస్తున్న ట్రాక్టర్‌లో మొత్తం ఆరుగురు కూలీలు ప్రయాణిస్తుండగా నాగారం స్టేజీ దగ్గరకు రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది.

స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.