ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.12.50 లక్షలు కొట్టేశారు

ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.12.50 లక్షలు కొట్టేశారు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఆన్​లైన్​ ట్రేడింగ్​ పేరుతో సైబర్​ నేరగాళ్లు ఓ వ్యక్తి వద్ద రూ.12.50 లక్షలు కొట్టేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ పట్టణంలోని శెట్టిపల్లి తిరుపతయ్య అనే యువకుడికి వాట్సాప్ లో గ్రూప్ కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్​ చేయగా ఆన్​లైన్ ట్రేడింగ్ వ్యాపారంలో ఇన్వెస్ట్​ చేస్తే అధిక లాభాలు వస్తాయని సైబర్​ నేరగాళ్లు చెప్పారు. 

బాధితుడిని నమ్మించి ఆన్​లైన్​లో పలు దఫాలుగా రూ.12 లక్షల 50 వేలు ట్రాన్స్​ఫర్​ చేయించుకున్నారు. ఆ తరువాత వారి ఫోన్​ స్విచాఫ్​ రావడంతో బాధితుడు స్కామ్​ అని గ్రహించాడు. శనివారం సైబర్ క్రైం, స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.