
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫుల్ ఫామ్లో ఉన్న టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందనా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే వన్డే ఫార్మాట్లో తాజాగా మరో మూడు అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది మందనా. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు చేసిన ఏకైక ప్లేయర్గా రికార్డ్ సృష్టించింది. ఉమెన్స్ వరల్డ్ కప్లో భాగంగా విశాఖపట్నంలో ఆదివారం (అక్టోబర్ 12) ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో మందనా ఈ ఫీట్ నెలకొల్పింది.
దీంతో పాటుగా భారత్ తరుఫున వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో మహిళా క్రికెటర్గా నిలిచింది. ఈ జాబితాలో మందనా కంటే ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఉన్నారు. మిథాలీ వన్డేల్లో 7,805 పరుగులు చేసి -భారత్తో పాటు మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్గా కొనసాగుతున్నారు.
మహిళల వన్డేల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు
- 1,068 - స్మృతి మంధాన (భారతదేశం), 18 ఇన్నింగ్స్లో 2025
- 970 - బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా), 14 ఇన్నింగ్స్లలో - 1997
- 882 - లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా), 18 ఇన్నింగ్స్లలో - 2022
- 880 - డెబ్బీ హాక్లీ (న్యూజిలాండ్), 16 ఇన్నింగ్స్లలో - 1997
- 853 - అమీ సాటర్త్వైట్ (న్యూజిలాండ్), 14 ఇన్నింగ్స్లలో - 2016
మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు
- 7,805 - మిథాలీ రాజ్ (భారతదేశం), 211 ఇన్నింగ్స్లలో
- 5,992 - షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్), 180 ఇన్నింగ్స్లలో
- 5,925 - సుజీ బేట్స్ (న్యూజిలాండ్), 167 ఇన్నింగ్స్లలో
- 5.873 - స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్), 163 ఇన్నింగ్స్లలో
- 5,022 - స్మృతి మంధాన (భారతదేశం), 112 ఇన్నింగ్స్లలో