Credit card fraud: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని.. రూ.6 లక్షలు కాజేశారు

Credit card fraud: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని.. రూ.6 లక్షలు కాజేశారు

Cybercrime: క్రెడిట్​కార్డు లిమిట్​పెంచుతామని ఓ వ్యక్తి బ్యాంక్​అకౌంట్​నుంచి రూ.6 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటన సైబరాబాద్​సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లింగంపల్లి కానుకుంట ప్రాంతానికి చెందిన రాజు రామకృష్ణ ట్రాన్స్ పోర్ట్​సూపర్​వైజర్​గా చేస్తున్నాడు. ఇతనికి ఆర్​బీఎల్​ప్లాటినమ్​ప్లస్​క్రెడిట్​కార్డు ఉంది. 

ఈ నెల19న ఓ వ్యక్తి కాల్​చేసి, తాను ఆర్​బీఎల్​ బ్యాంక్​నుంచి మాట్లాడుతున్నానని చెప్పి, మీ క్రెడిట్ కార్డు లిమిట్​ను రూ.5 లక్షలకు పెంచుతామని చెప్పడంతో రామకృష్ణ అంగీకరించాడు. దీంతో అతను రామకృష్ణ వాట్సప్​కు ఆర్​బీఎల్ యాప్​బ్యాంక్​ పేరుతో ఏపీకే లింక్​పంపించాడు. దాన్ని క్లిక్ చేయగానే ఆరుసార్లు రూ.లక్షల చొప్పున రూ.6 లక్షలు క్రెడిట్ కార్డు నుంచి డెబిట్ అయ్యాయి. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైం​పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

ట్రేడింగ్ పేరుతో రూ.11 లక్షలు..  

ట్రేడింగ్​లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.11 లక్షలు కాజేశారు సైబర్​ మోసగాళ్లు. ఈ ఘటన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్​ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్​కు చెందిన రవి కిరణ్ కు గత ఏప్రిల్​6న వాట్సప్​లో యాక్సిస్​సెక్యూరిటీస్​పేరుతో ట్రేడింగ్​గ్రూప్​మెసేజ్​వచ్చింది.  ప్రణవ్, అనయ మెహ్రా ఫోన్​చేసి.. తాము పెట్టుబడులు పెట్టడంలో సహాయపడతామని రవి కిరణ్​ను నమ్మించారు. 

దీంతో అతను దశల వారీగా రూ.13.36 లక్షలను ట్రేడింగ్​యాప్​లో పెట్టుబడి పెట్టాడు. రూ.2 లక్షలు విత్​డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత  రూ.9.34 లక్షలు ప్రాఫిట్​వచ్చినట్లు యాప్​లో చూపించినా.. విత్​డ్రా చేసుకోవాలంటే మరో రూ. 4 లక్షలు చెల్లించాలని ప్రణవ్, అనయ మెహ్రా డిమాండ్​చేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్​ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు  పేర్కొన్నారు.