
- డ్రగ్స్ అమ్మేందుకు బెంగళూర్ నుంచి హైదరాబాద్కు
- నిందితుడు మురళీధరన్ అరెస్టు
- 10 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
శంషాబాద్, వెలుగు : డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న బెంగళూరుకు చెందిన మురళీధరన్(28)ను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో స్విగ్గీ డెలివరీ బాయ్గా పని చేసిన మురళీధరన్.. జీతం సరిపోక డ్రగ్స్ ఈ దందాలోకి దిగాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఎండీఎంఏ డ్రగ్ ను విక్రయించేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చాడు.
బుధవారం శంషాబాద్ లోని వెంగమాంబ హోటల్ వద్ద డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తుంచగా.. పక్కా సమాచారంతో అక్కడ మాటు వేసిన ఎయిర్ పోర్టు పోలీసులు మురళీధరన్ ను అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.