
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి – మెహిదీపట్నం రూట్లోని ఖాజాగూడ జంక్షన్ను శనివారం క్లోజ్ చేయనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఒకరోజు క్లోజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనదారలు ఇతర మార్గాల్లో ట్రావెల్ చేయాలని సూచించారు.
ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
- నానక్రాంగూడ నుంచి విస్పర్ వ్యాలీ రూట్లో వెళ్లే వాహనదారులు బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఫ్రీ లెఫ్ట్ తీసుకొని పక్వాన్ రెస్టారెంట్ వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.
- షేక్పేట ఫ్లై ఓవర్నుంచి ఫిల్మ్నగర్ వైపు వెళ్లే వాహనదారులు పక్వాన్ యూటర్న్వరకు వెళ్లి అక్కడి నుండి విస్పర్వ్యాలీ రూట్లో ట్రావెల్ చేయాలి.
- బయో డైవర్సిటీ జంక్షన్నుంచి మణికొండ వైపు వెళ్లే వాహనదారులు షేక్ పేట ఫ్లైఓవర్ కింద ఉన్న పోచమ్మ ఆలయం వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.