కేవైసీ అప్డేట్ ​అంటూ రూ.2 లక్షలు టొకరా

కేవైసీ అప్డేట్ ​అంటూ రూ.2 లక్షలు టొకరా

హైదరాబాద్‌‌, వెలుగు:కేవైసీ అప్టేడ్ ​పేరిట ముగ్గురి అకౌంట్ల నుంచి సైబర్​ క్రిమినల్స్​ రూ.2 లక్షలా 22వేలు కొట్టేశారు. పురానాపూల్‌‌కు చెందిన విభూతి భూషణ్ మొబైల్‌‌కు బ్యాంక్​ ఆఫీసర్​ను అంటూ శుక్రవారం ఓ ఫేక్​ కాల్‌‌ వచ్చింది. అవతలి వ్యక్తి మీ గూగుల్ పే అకౌంట్‌‌కు కేవైసీ అప్టేడ్ చేయాలని ​చెప్పి డీటెయిల్స్​తోపాటు ఓటీపీ కూడా తెలుసుకున్నాడు. అలా రూ.లక్షా 4 వేలు కాజేశాడు. ఎస్‌‌ఆర్ నగర్ బీకే గూడకు చెందిన సందీప్ కుమార్ అకౌంట్​నుంచి 68 వేలు, నగరానికి చెందిన మరోవ్యక్తి చంద్రబోస్ అకౌంట్​లో రూ.50 వేలు ఇలాగే కొట్టేశారు. బాధితులు శనివారం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.