
తేజ్ తుఫాను అక్టోబర్ 24 తెల్లవారుజామున తీవ్ర తుఫానుగా మారి యెమెన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)తెలిపింది. అంతకుముందు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా చేసిన ప్రకటన ప్రకారం.. ఈ సైక్లోన్ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తర్వాత మూడు రోజుల్లో ఇది తిరిగి ఉత్తర-ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశాలోని పారాదీప్కు దక్షిణంగా 610 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని IMD ఓ ప్రకటనలో తెలిపింది. "రాబోయే 24 గంటల్లో ఈ వ్యవస్థ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది తదుపరి 12 గంటల్లో వాయువ్య దిశగా కదిలి, తర్వాత మూడు రోజుల్లో బంగ్లాదేశ్-పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదులుతుంది" అని చెప్పింది.
Also Read :- గాజాపై మరోదాడి
అక్టోబరు 25 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులు హెచ్చరించారని వాతావరణ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాష్ చెప్పారు. ఒడిశా తీర ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అక్టోబర్ 23 నాటికి పరిపక్వమైన వరి పంటలను పండించాలని IMD రైతులను హెచ్చరించినట్లు ఆయన చెప్పారు. లోతైన సముద్రంలో ఉన్న మత్స్యకారులు తిరిగి తీరానికి వెళ్లాలని సూచించారు.
ESCS “TEJ” OVER WC ARABIAN SEA MOVED NW DURING PAST 6 HRS AND LAY CENTERED AT 0530 HRS IST OF 23 OCT OVER WC ARABIAN SEA ABOUT 200 KM N-NW OF SOCOTRA (YEMEN), 300 KM S OF SALALAH (OMAN) AND 240 KM SE OF AL GHAIDAH (YEMEN). TO MOVE NW AND WEAKEN INTO A VSCS DURING NEXT 06 HRS. pic.twitter.com/YhaIlKjRzx
— India Meteorological Department (@Indiametdept) October 23, 2023