స్టూడెంట్ల స్కిల్స్ మెరుగుపరిచేందుకు సీఈఎంఎస్‌‌తో సైయంట్‌‌ జోడి

స్టూడెంట్ల స్కిల్స్ మెరుగుపరిచేందుకు  సీఈఎంఎస్‌‌తో సైయంట్‌‌ జోడి

హైదరాబాద్‌‌, వెలుగు: స్టూడెంట్స్‌‌ స్కిల్స్‌‌ మెరుగుపరిచేందుకు  సెంటర్ ఆఫ్ ఎక్స్‌‌లెన్స్‌‌ ఇన్‌‌ మారిటైమ్‌‌ అండ్ షిప్‌‌బిల్డింగ్‌‌ (సీఈఎంఎస్‌‌) తో  టెక్ కంపెనీ సైయంట్ ఎంఓయూ కుదుర్చుకుంది. స్టూడెంట్‌‌లకు  క్యాడ్‌‌, సీఏఈ  పీఎల్‌‌ఎం, ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌‌కు సంబంధించిన స్కిల్స్ నేర్పిస్తారు. 

మారిటైమ్ ఇండస్ట్రీలో అవసరమయ్యే వర్క్‌‌ఫోర్స్‌‌ను డెవలప్ చేయడానికి ఈ ఎంఓయూ సాయపడుతుందని సైయంట్ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. సీఈఎంఎస్‌‌ ఫ్యాకల్టీ,  సైయంట్ మెంబర్లు కలిసి స్టూడెంట్స్‌‌కు వివిధ స్కిల్స్‌‌ నేర్పిస్తారు. ఇండస్ట్రీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్లకు  ట్రెయినింగ్‌‌  ఇవ్వడం, ల్యాబ్‌‌లు, టెక్నాలజీలను అప్‌‌గ్రేడ్ చేయడం వంటివి చేపడతారు.