పాలాభిషేకం..ఈటల వల్లే దళిత బంధు

పాలాభిషేకం..ఈటల వల్లే దళిత బంధు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నగురం, తనుగుల SC కాలనీలో బీజేపీ నేత ఈటల రాజేందర్ కి పాలాభిషేకం చేశారు దళిత సంఘాల నేతలు. సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం అమలుకు హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఈటల రాజేందరే అన్నారు. ఏనాడు దళితులను పట్టించుకోని KCR.... ఇవాళ దళితుల గురించి మాట్లాడుతున్నాడంటే అందుకు ఈటల రాజేందర్ అన్నారు. దళితులంతా ఈటలవైపే ఉన్నారనే.... భయంతో కేసీఆర్ దళిత స్కీం తెచ్చారని చెప్పారు. తనుగుల ఎంపీటీసీ భర్తతో దళిత బంధు గురించి సీఎం ఫోన్ లైన్ లో మాట్లాడారు. అయితే.. అదే ఊరికి చెందిన దళితులు.. ఈటలకు పాలాభిషేకం చేశారు.