- దళిత బంధు సాధన సమితి డిమాండ్
బషీర్బాగ్, వెలుగు: పెండింగ్లో ఉన్న దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి స్టేట్ ప్రెసిడెంట్ కోగిల మహేశ్ డిమాండ్ చేశారు. గురువారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఆయన మాట్లాడారు.
ఎలక్షన్ల టైమ్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ముఖ్యంగా అంబేద్కర్ అభయ హస్తం పథకానికి చట్టబద్ధత కల్పించాలని కోరారు. దళిత బంధు కోసం కేటాయించిన రూ.వెయ్యి కోట్లు ఏమయ్యాయో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.
