
హైదరాబాద్, వెలుగు: దసోస్ క్యాబినెట్స్ హైదరాబాద్లో తమ హోం ఇంటీరియర్స్ సేవలను మొదలుపెట్టింది. ఇది క్యాబినెట్స్తో పాటు మాడ్యులర్, ఫర్నిచర్ తయారు చేస్తుంది. డిమాండ్లను తీర్చడానికి తూప్రాన్ వద్ద రూ.40 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ప్లాంటును ప్రారంభించినట్టు తెలిపింది.
ఇక్కడ మాడ్యులర్ ఫర్నిచర్ను తయారు చేస్తారు. వ్యాపార విస్తరణకు రాబోయే కొన్నేళ్లలో రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. యాక్టర్ నాగచైతన్యను తమ బ్రాండ్అంబాసిడర్గా నియమించుకుంది.