ఓవైసీ బ్రదర్స్ ను తరిమికొట్టే రోజులు రాబోతున్నయ్

ఓవైసీ బ్రదర్స్ ను తరిమికొట్టే రోజులు రాబోతున్నయ్

రాజాసింగ్ అరెస్టును యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ కె. శివకుమార్ తీవ్రంగా ఖండించారు. హిందువులంతా వందల బెయిల్ పిటిషన్లు వేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ అల్లర్లకు కేసీఆర్, కేటీఆర్ కుట్ర పన్నారన్న ఆయన... తెలంగాణ ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొట్టి హైదరాబాద్ లో శాంతియుత వాతావరణం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మునావర్ ఫారుఖి హిందూ దేవుళ్లను కించపరిస్తే.. ప్రభుత్వం, పోలీసులు కలిసి ఆయన షోకు అనుమతిచ్చారన్నారు. నాస్తికుడైన కేటీఆర్.. ఈ కామెడీని ఎంజాయ్ చేశాడని శివకుమార్ విమర్శించారు. ధర్మం కోసం పోరాడే ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఈ ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టడం దారుణమని వాపోయారు. ఈ ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముకాస్తుందనడానికి ఇదే నిదర్శనమన్న శివ కుమార్... రాజాసింగ్ ను బీజేపీ సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. త్వరలోనే చర్లపల్లి జైలుకు వెళ్లి రాజాసింగ్ ను కలుస్తామని ఆయన స్పష్టం చేశారు. 

బంగారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మంటలు రేపుతోందని శివ కుమార్ ఆరోపించారు. ఈ సమయంలో హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. హిందువులంతా రాజాసింగ్ కోసం వందలాది బెయిల్ పిటిషన్లు వేసి మన ఐక్యతను చాటాలని శివ కుమార్ కోరారు. ఓవైసీ బ్రదర్స్ ను హైదరాబాద్ నుండి తరిమికొట్టే రోజులు రాబోతున్నాయన్న ఆయన.. గోవధ నిషేధ చట్టాల అమలు కోసం నిరసనలు ప్రదర్శనలు చేపట్టేందుకు ఎన్నిసార్లు అడిగినా అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ధర్మం కోసం పోరాటం చేస్తున్న రాజాసింగ్ కు మద్దతుగా స్వామీజీలు స్పందించాలని శివ కుమార్ డిమాండ్ చేశారు. ధర్మం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.