దేశంలో ఇప్పుడు కల్తీ రాజ్యం ఏలుతుంది. ఉప్పుదగ్గరి నుంచి చివరకు ఆరోగ్యాన్ని కాపాడుకొనే మందుల వరకు నకిలీవి మార్కెట్లో చలామణి అవుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ గండిపేటలోని ఓ ఫార్మసీ దుకాణంలో ఫేక్ఆయుర్వేద టాబ్లెట్స్ ను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(DCA ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుప్పాలగూడలో ఆయుర్వేదానికి చెందిన పానియన్ టాబ్లెట్స్ రుమాటిజం వ్యాధికి మందు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(DCA ) అధికారులు గుర్తించారు. ఇది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం, 1954కి విరుద్ధమని డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు దాడిచేసి ఆరోగ్యానికి హాని కలిగించే పానియన్ టాబ్లెట్స్ను DCA అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణ యజమానిపై కేసు నమోదు చేసి చట్ట రకారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మార్చి 27న సేరిలింగంపల్లి DCA అధికారులు జరిపిన ప్రత్యేక దాడుల్లో ఈ ఔషధాన్ని గుర్తించారు. ఈ మందు పంజాబ్ లోని లూథియానాలో విన్ ట్రస్ట్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ దీనిని తయారు చేసిందని డీసీఏ తెలిపింది. ఈ మందుకు సంబంధించిన లేబుల్లోరుమాటిక్ ఆర్థరైటిస్, గౌట్, ఆస్టియో ఆర్థరైటిస్ & ఫైబ్రేటైటిస్' చికిత్స కోసం అని తప్పుగా ఉందని డీసీఏ అధికారి కమలాసన్ రెడ్డి తెలిపారు. రుమాటిజం చికిత్సకు సంబంధించి దీనిని డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం, 1954 ప్రకారం నిషేధించారు. సేరిలింగంపల్లి అసిస్టెంట్ డైరక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గండిపేట డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ డి.శ్వేతబిందు ఈ దాడులు నిర్వహించారు.