యాదాద్రిలో కోమటిరెడ్డి, డీసీసీ వర్గాలు ఎవరి ధర్నాలు వారివే

యాదాద్రిలో కోమటిరెడ్డి, డీసీసీ వర్గాలు  ఎవరి ధర్నాలు వారివే

యాదాద్రి, వెలుగు :  దశాబ్ది దగా‘ కార్యక్రమం సందర్భంగా యాదాద్రిలో కాంగ్రెస్​లోని విబేధాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. డీసీసీ, కోమటిరెడ్డి వర్గాలు వేర్వేరుగా ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించాయి. భువనగిరిలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​ రెడ్డి తహసీల్దార్​ఆఫీసు ఎదుట ధర్నా చేసి, పది తలలతో కూడిన కేసీఆర్​ ఫ్లెక్సీని దహనం చేశారు. 

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వర్గం  లీడర్లు భువనగిరి ఆర్డీవో ఆఫీసు ఎదుట ధర్నా చేసి కేసీఆర్​ ఫ్లెక్సీని దహనం చేసి నిరసన తెలిపారు. ఆలేరులో కోమటిరెడ్డి వర్గమైన బీర్ల అయిలయ్య నిర్వహించిన ధర్నాకు కొందరు లీడర్లు హాజరు కాలేదు.