డీసీఎం బోల్తా పడి యువకుడి మృతి .. శంషాబాద్ పరిధి ఓఆర్ఆర్​పై ఘటన

డీసీఎం బోల్తా పడి యువకుడి మృతి .. శంషాబాద్ పరిధి ఓఆర్ఆర్​పై ఘటన

శంషాబాద్, వెలుగు: డీసీఎం బోల్తా పడి యువకుడు చనిపోయిన ఘటన శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్​స్పెక్టర్ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడివెల్లి గ్రామానికి చెందిన ఎండీ మహ్మద్ ఆర్ఎంసీ ప్లాంట్​లో డీసీఎం డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం 8 గంటలకు డీసీఎంలో నలుగురు కూలీలను తీసుకుని తుక్కుగూడ నుంచి శంషాబాద్ వైపు వస్తున్నాడు.  

పెద్ద గోల్కొండ వద్ద ఓఆర్ఆర్​పై అతడి డీసీఎంను మరో వెహికల్ ఢీకొట్టింది. ప్రమాదంలో డీసీఎం బోల్తా పడింది. నలుగురు కూలీల్లో సూరజ్ కుమార్(20) అనే యువకుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురు కూలీలు అరుణ్​ కుమార్, విక్రమ్, జగదీశ్​స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్​బాడీని ఉస్మానియాకు తరలించారు. గాయపడ్డ వారిని దగ్గరలోని హాస్పిటల్​కు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు