
మంచు ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసులు వచ్చేస్తున్నారు. మోహన్ బాబు, విష్ణు తెరకెక్కించిన కన్నప్ప సినిమాతో సిల్వర్ స్క్రీన్పై మంచు ఫ్యామిలీ మూడో తరం ఎంట్రీ ఇస్తోంది.
మంచు విష్ణు కొడుకు అవ్రామ్, కుమార్తెలు అరియానా, వివియానా.. ఈ ముగ్గురు కన్నప్పతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. విష్ణు చిన్నప్పటి తిన్నడు పాత్రలో అవ్రామ్ కనిపించనున్నాడు. ఇప్పటికీ వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకున్నారు. 'జనులారా వినరారా శ్రీకాళహస్తి గాథ' అనే పాటను స్వయంగా అరియానా, వివియానా పాడి శభాష్ అనిపించుకున్నారు.
లేటెస్ట్గా మంచు అవ్రామ్ (7) సినీ ఎంట్రీపై విష్ణు తన ఆనందాన్ని షేర్ చేస్తూ.. ఓ వీడియో షేర్ చేశాడు. "నా చిట్టి అవ్రామ్, కన్నప్పతో అరంగేట్రం చేస్తున్నాడు. అవ్రామ్ సెట్లోకి అడుగు పెట్టడం, డైలాగులు చెప్పడం, తన కలను సాకారం చేసుకోవడం అనేది నా జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణాలలో ఒకటి.
ఒక తండ్రిగా, నేను ఒకప్పుడు కన్న కలలనే, అదే ఆకాశం కింద.. నా కొడుకు కూడా నిజం చేసుకోవడం చూడటం కంటే గొప్ప సందర్భం మరొకటి లేదు. ఇది కేవలం అరంగేట్రం కాదు. ఇది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం"
►ALSO READ | భీమ్స్కు బంపర్ ఆఫర్.. మెగాస్టార్కు మాస్ సాంగ్ కంపోజ్ చేసే ఛాన్స్ !
"మీరు నాకు ఎల్లప్పుడూ ఇచ్చిన అదే ప్రేమ, ఆశీర్వాదాలతో మీరందరూ అవ్రామ్ పై కూడా కురిపిస్తారని ఆశిస్తున్నాను. అవ్రామ్ ప్రయాణం మొదలవుతుంది. అది కన్నప్పతోనే మొదలవుతుంది. హర్ హర్ మహాదేవ్ " అని విష్ణు అభిప్రాయపడ్డాడు.
My little Avram, makes his debut in Kannappa.
— Vishnu Manchu (@iVishnuManchu) June 18, 2025
Watching him walk onto the set, say his lines, and live this dream, has been one of the most emotional moments of my life.
As a father, nothing compares to seeing your child shine under the same sky you once dreamed beneath.
This… pic.twitter.com/b6HfJDQXDB
విష్ణు షేర్ చేసిన BTS వీడియోలో అవ్రామ్ చాలా చురుకుగా కనిపిస్తున్నాడు. సెట్ లో తాను చేసే అల్లరికన్నా, నటనపై చూపే ఆసక్తే ఎక్కువ కనిపిస్తుంది. తన తండ్రి విష్ణుతో మాట్లాడుతూ, కాస్ట్యూమ్లు వేసుకుంటూ, తన డైలాగులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించి ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మంచు ఫ్యాన్స్ తో పాటు అందరినీ ఆకట్టుకుంటోంది.
కన్నప్ప విషయానికి వస్తే:
మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని 'కన్నప్ప' చిత్రాన్ని రూపొందించారు. విష్ణు కథ, స్క్రీన్ ప్లే అందించగా.. 'మహాభారత' సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ తో మోహన్ బాబు నిర్మించగా.. విష్ణుకన్నప్ప భక్తుడి రోల్ పోషిస్తుండగా.. అక్షయ్ కుమార్ శివుడిగా, మోహన్లాల్ కిరాతుడిగా, ప్రభాస్ రుద్రుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతి దేవిగా కనిపించనున్నారు. ఈ మూవీ జూన్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.