నాగార్జున ఫాంహౌస్​లో డెడ్ బాడీ కలకలం

నాగార్జున ఫాంహౌస్​లో డెడ్ బాడీ కలకలం

షాద్​నగర్, వెలుగు: హీరో అక్కినేని నాగార్జునకు చెందిన పొలం దగ్గర గుర్తుతెలియని మృతదేహం బుధవారం బయటపడింది. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ మండలం పాపిరెడ్డి గూడలో ఆయన వ్యవసాయ క్షేత్రంలోని ఓ గదిలో కుల్లిపోయిన మృతదేహం కనిపించడం కలకలం రేపింది.

40 ఎకరాల క్షేత్రంలో సేంద్రీయ పంటలు పండించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా నాగార్జున కుటుంబ సభ్యులు నిపుణులను పంపించారు. పొలంలో ఉన్న ఓ గదిలో కుల్లిపోయిన డెడ్ బాడీని గుర్తించి వాళ్లు పోలీసులకు చెప్పారు.