సోమవారం భారత్ చేరుకోనున్న నవీన్ మృతదేహం

సోమవారం భారత్ చేరుకోనున్న నవీన్ మృతదేహం

ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లి రష్యా దాడుల్లో మృతి చెందిన నవీన్ శేఖరప్ప మృతదేహం ఎట్టకేలకూ భారత్ చేరుకోనుంది. ఆదివారం భౌతికకాయం  బెంగళూరుకు చేరుకుంటుందని సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. నవీన్ తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు  కేంద్రం అతని మృతదేహాన్ని భారత్ రప్పించేందుకు చర్యలు తీసుకుంది. 

కర్నాటక హవేరీ జిల్లాకు చెందిన 21 ఏళ్ల నవీన్ శేఖరప్ప.. ఉక్రెయిన్ లోని ఖర్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. మార్చి 1న నవీన్ నిత్యావసరాల కొనేందుకు ఓ సూపర్ మార్కెట్ ముందు క్యూలో నిలబడి ఉన్న సమయంలో రష్యా జరిపిన దాడుల్లో మృతి చెందాడు. దాడుల్లో నవీన్ మృతి చెందడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని రష్యా ప్రకటించింది.