ముగిసిన GHMC ఎన్నికల నామినేషన్ల గడువు

ముగిసిన GHMC ఎన్నికల నామినేషన్ల గడువు

GHMC ఎన్నికల నామినేషన్ల గడువు ఇవాళ్టి(శుక్రవారం)తో ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ 26 మంది సిట్టింగ్‌లను మార్చగా, బీజేపీ 129 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం ఇంకా 69 డివిజన్లలో అభ్యర్థులను ప్రకటించలేదు. రేపు(శనివారం) నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎల్లుండి(ఆదివారం) నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.

నామినేషన్‌ పత్రాలు దాఖలకు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలన్నీ తుది జాబితాపై కసరత్తు మరింత వేగవంతం చేశాయి.