గ్యాస్ లబ్ధిదారులు వేలిముద్రలు వేయాలి : గ్యాస్​ సెంటర్ల డీలర్లు

గ్యాస్ లబ్ధిదారులు వేలిముద్రలు వేయాలి : గ్యాస్​ సెంటర్ల డీలర్లు

భిక్కనూరు, వెలుగు: గ్యాస్​ సిలిండర్‌‌ లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ కచ్చితంగా తమ గ్యాస్ సభ్యత్వ బుక్‌ తో స్ధానిక ఆఫీస్​కు వచ్చి వేలి ముద్రలు వేయాలని సంబంధిత గ్యాస్​ సెంటర్ల డీలర్లు ఆదేశించారు.  మంగళవారం మండల కేంద్రంలోని  హెచ్‌పీ గ్యాస్​ ఆఫీస్‌ వద్ద లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేలి ముద్రలు వేశారు.

ఈ సందర్భంగా గ్యాస్​ ఎజెన్సీ నిర్వాహకులు మాట్లాడుతూ..  కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అసలు గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారో లేదో గుర్తించే ప్రక్రియ అన్నారు. ఒకవేళ లబ్ధిదారులు చనిపోతే వారి స్థానంలో కుటుంబ సభ్యులకు సభ్యత్వం కల్పించేందుకు ఆదేశాలు వచ్చాయన్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్​31 వరకు ఉంటుందని లబ్ధిదారులు ఆందోళన చెందకూడదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు.