మెగా 156 నుండి క్రేజీ న్యూస్ వైరల్.. చిరు జోడీగా ప్రభాస్ హీరోయిన్

మెగా 156 నుండి క్రేజీ న్యూస్ వైరల్.. చిరు జోడీగా ప్రభాస్ హీరోయిన్

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దర్శకుడు వశిష్ట(Vasishta)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షెరవేగంగా జరుగుతోంది. ఈ భారీ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారని సమాచారం. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనె ను తీసుకోనున్నారట. ఇందుకు సంబందించిన సంప్రదింపులు కూడా ఇప్పటికే జరిగాయట. దీపికా కూడా ఈ ప్రాజెక్టుపై సుముకంగానే ఉన్నరని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ పేరు గట్టిగా వినిపించింది. దాదాపు ఫైనల్ అయ్యింది అనుకున్నారంతా. కానీ, అనూహ్యంగా లైన్ లోకి దీపికా వచ్చారు. దీంతో మృణాల్ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ మిస్ చేసుకున్నారు.

ఇక మెగా 156 మూవీ విషయానికి వస్తే.. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ అనుకునున్నారట మేకర్స్. ఈ టైటిల్ కు సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. చోట కే నాయుడు కెమెరామన్ గా చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.