కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండేలా ధర, పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచించారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టే దేశాల లిస్టులో త్వరలోనే ఇండియా కూడా చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
India will be one of the COVID-19 vaccine-producing nations.
It needs a clearly-defined, inclusive & equitable vaccine access strategy ensuring availability, affordability & fair distribution.
GOI must do it now.
— Rahul Gandhi (@RahulGandhi) August 14, 2020
‘వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండియా ఒకటిగా ఉంటుంది. అయితే వ్యాక్సిన్ అందుబాటు, ధర, పంపిణీపై స్పష్టమైన వ్యూహం ఉండాలి. ఈ దిశగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టాలి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రపంచంలోని పలు దేశాలతోపాటు ఇండియాలో కూడా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే.