
అడవులు అంతరించిపోకుండా కాపాడటంలో ప్రపంచ దేశాలు ఫెయిల్ అవుతున్నాయి. చెట్ల కొట్టివేతకు చెక్ పెట్టలేకపోతున్నాయి. డీఫారెస్టేషన్ను వచ్చే ఏడాది కల్లా సగానికి తగ్గించాలని, 2030 నాటికి పూర్తిగా ఆపాలని ఐదేళ్ల క్రితమే అనుకున్నారు. ఆ దిశగా అడుగులు పడట్లేదు. ‘న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్స్’(ఎన్వైడీఎఫ్)పై విడుదలైన ఓ అసెస్మెంట్ ఈ విషయాన్ని తెలిపింది. ఫారెస్ట్ల నరికివేత నాన్ స్టాప్గా సాగుతోందని, దీనివల్ల ప్రమాదకరమైన వాతావరణ మార్పులను అడ్డుకోలేకపోతున్నామని హెచ్చరించింది.
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని మేజర్ ప్రొటెక్టెడ్ ఏరియాలు డీఫారెస్టేషన్కు, డిగ్రడేషన్కే గురవుతున్నాయి. ఈ లిస్టులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని టైగర్ రిజర్వ్ ప్రాంతాలున్నాయి. తెలంగాణలోని 18.5 శాతం ఫారెస్టులు ప్రస్తుతం అంతరించిపోయే పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. 26.1 శాతం అడవులు ఇప్పటికే చెట్ల నరికివేత, కార్చిచ్చు, ఫ్రాగ్మెంటేషన్ల వల్ల కనుమరుగయ్యాయి. 1975–2014 మధ్య కాలంలో ఏపీ 2,390 స్క్వేర్ కిలోమీటర్ల ఫారెస్ట్ ఏరియాను, తెలంగాణ 1,300 స్క్వేర్ కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని నష్టపోయాయని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) రీసెర్చ్లో తేలాయి. అడవుల్లో మంటలు చెలరేగటం తెలుగు రాష్ట్రాలకు పెద్ద సమస్యగా మారింది. 2014లో మొత్తం 3,489 స్క్వేర్ కిలోమీటర్ల మేర ఫారెస్టులు కార్చిచ్చు వల్ల కాలిబూడిదయ్యాయి. ఇందులో ఏపీకి చెందిన 1,072 స్క్వేర్ కిలోమీటర్ల అటవీ ప్రాంతం కూడా ఉంది. మంటల్లో తగలబడిపోయిన మొత్తం ఫారెస్ట్ కవర్లో దాదాపు 32 శాతం కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతమేనని ఎన్ఆర్ఎస్సీ రీసెర్చర్లు తెలిపారు.
ఎందుకు నరికేస్తున్నారు?
పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా ఇళ్లు కట్టడానికి
పట్టణాల విస్తీర్ణత, మౌలిక అవసరాల కోసం
కార్పొరేట్ కల్చర్ పెరగడంతో ఫర్నీచర్ కలప కోసం
రేటు ఎక్కువ పలికే కన్న్స్యూమర్ ఐటమ్స్ తయారీ కోసం
పామాయిల్ వంటి ముడి సరుకును అందించటానికి
పశువులకు కావాల్సిన గడ్డి భూములను పెంచడం కోసం అభివృద్ధి చెందని దేశాల్లో వంట చెరుకుగా వాడడానికి.
డీఫారెస్టేషన్కు గురైన ఏరియాలు..
- నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వ్)
- శ్రీ పెనుశిల నరసింహ శాంక్చువరీ
- పాపికొండ శాంక్చువరీ
- శ్రీవేంకటేశ్వర శాంక్చువరీ
- ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సర్కిల్
- ఒడ్డుగూడెం ఫారెస్ట్ సెక్షన్
- నర్సాపూర్ వెస్ట్ ఫారెస్ట్ సెక్షన్
చెట్లు కొట్టేస్తే…ఇతర అవసరాల కోసం చెట్లను పర్మినెంట్గా కొట్టేసి అటవీ భూములను అందుబాటులోకి తెచ్చుకోవటాన్నే డీఫారెస్టేషన్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ కోటీ 80 లక్షల ఎకరాల్లో ఫారెస్ట్ నేలమట్టమవుతోందని, ఇది పనామా కంట్రీ సైజ్తో సమానమని యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తెలిపింది. అడవులు లేకపోవటం వల్ల కలిగే నష్టాలు..
భూమ్మీద పెరిగే మొక్కలు, జంతువుల్లో 70 శాతం అడవుల్లోనే ఉంటాయి. డీఫారెస్టేషన్తో అవి షెల్టర్ కోల్పోతాయి.
డీఫారెస్టేషన్ వల్ల క్లైమేట్లోకి గ్రీన్హౌస్ వాయువులు దాదాపు 15 శాతం అదనంగా రిలీజ్ అవుతాయి.
చెట్లు లేకపోతే వాతావరణంలోని వాటర్ లెవెల్స్ని, తేమను కంట్రోల్ చేయటం కష్టం.
భూమ్మీద చెట్లను నరికేస్తే వానలు పడవు. దీనివల్ల పంటలు పండక కరువు నెలకొంటుంది.
భారీ వర్షాలు కురిసినప్పుడు భూమ్మీద పెద్ద చెట్లు లేకపోతే నేల కోతకు గురవుతుంది.
అడవులు లేకపోతే ఈ మోడ్రన్ ప్రపంచంలో మనిషి లైఫ్స్టైల్పైన ఇమ్మిడియెట్, డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది.