ఆలస్యంగా జేఈఈ మెయిన్స్.. అభ్యర్థుల ఆందోళన

ఆలస్యంగా జేఈఈ మెయిన్స్.. అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్ అబిడ్స్ లోని  అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో జేఈఈ మెయిన్స్ పరీక్ష శుక్రవారం ఉదయం గంటన్నర ఆలస్యంగా (10.30 గంటలకు) ప్రారంభమైంది. సర్వర్ డౌన్, టెక్నికల్ సమస్యల వల్ల ఇలా జరిగిందని కళాశాల  సిబ్బంది తెలిపారు. ఇంటర్నెట్ సమస్య వల్ల ఉదయం జరిగిన పరీక్షలో 26 ప్రశ్నలు డిస్ ప్లే కాలేదని విద్యార్థులు  ఆరోపించారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్షకు కూడా ఆలస్యంగా అనుమతించారు. దీంతో  విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎగ్జామ్ ప్రారంభం కానందుకు నిరసనగా  పలువురు విద్యార్థులు కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పద్ధతిలో పరీక్ష నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.